షవర్మా తిన్న నలుగురు కస్టమర్లు వాంతులు, విరేచనాలతో ఆసుపత్రి పాలయ్యారు

byసూర్య | Sat, Nov 09, 2024, 02:39 PM

పదిహేను రోజుల క్రితమే ఫుడ్ పాయిజనింగ్ కారణంగా మూతపడిందా రెస్టారెంట్...! అన్నీ సర్దుకుని, మార్పులు చేర్పులు చేశాక మూడు రోజుల కిందటే యాజమాన్యం మళ్లీ తెరిచింది. అక్కడ షవర్మా బాగుంటుందనే పేరుండడంతో జనం మళ్లీ ఎగబడ్డారు. ఇటీవలే ఫుడ్ పాయిజనింగ్ జరిగిందన్న విషయం తెలిసీ ఆ రెస్టారెంట్ కు క్యూ కట్టారు. తాజాగా మరోసారి అదే రెస్టారెంట్ లో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. షవర్మా తిన్న నలుగురు కస్టమర్లు వాంతులు, విరేచనాలతో ఆసుపత్రి పాలయ్యారు.హైదరాబాద్ లోని గ్రిల్ హౌస్ రెస్టారెంట్ లో చోటుచేసుకుందీ ఘటన. ఆసుపత్రిలో చేరిన నలుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పదిహేను రోజుల్లో రెండుసార్లు ఫుడ్ పాయిజనింగ్ జరగడంపై స్థానికులు సదరు రెస్టారెంట్ యాజమాన్యంపై మండిపడుతున్నారు. గ్రిల్ హౌస్ రెస్టారెంట్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, మళ్లీ తెరిచే అవకాశం లేకుండా రెస్టారెంట్ ను మూసేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.


Latest News
 

బండి సంజయ్‌పై బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు Mon, Mar 24, 2025, 08:36 PM
హై డ్రా పేరుతో సెటిల్ మెంట్లు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తాం : రంగనాథ్ Mon, Mar 24, 2025, 08:23 PM
జీహెచ్ఎంసీ పరిధిలోని సమస్యలపై ఆమె దృష్టి సారించడం లేదని ఆవేదన Mon, Mar 24, 2025, 08:22 PM
గాంధీ ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శించిన రైల్వే ఎస్పీ Mon, Mar 24, 2025, 08:18 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు Mon, Mar 24, 2025, 08:15 PM