డియర్‌నెస్ అలవెన్స్‌ను 3.65 శాతం పెంచుతూ ఉత్తర్వులు

byసూర్య | Wed, Oct 30, 2024, 07:23 PM

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి సందర్భంగా శుభవార్త అందించింది. ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌ను (డీఏ) 3.64 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన డీఏ 2022 జులై 1వ తేదీ నుంచి వర్తిస్తుందని వెల్లడించింది. నవంబర్ జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లింపులు చేయనున్నారు. 2022 జులై 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు.వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ లోపు పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు డీఏ బకాయిలను 17 సమాన వాయిదాల్లో చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలు పది శాతం ప్రాన్ ఖాతాకు జమ చేస్తారు. మిగిలిన 90 శాతాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లిస్తారు. రిటైర్డ్ ఉద్యోగులకు డీఏ బకాయిలను 2025 జనవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.


Latest News
 

వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని తండ్రినే హతమార్చిన కూతురు Thu, Jul 10, 2025, 06:46 AM
హైదరాబాద్‌లో కల్తీ కల్లు తీవ్ర విషాదాన్ని నింపింది Thu, Jul 10, 2025, 06:42 AM
నిమ్స్‌లో కల్తీ కల్లు బాధితులకు చికిత్స మొత్తం 20 మంది ఆస్పత్రిలో చేరిక Thu, Jul 10, 2025, 06:17 AM
కేసీఆర్, జగన్ వల్లే తెలంగాణకు తీవ్ర నష్టం: సీఎం రేవంత్ రెడ్డి Wed, Jul 09, 2025, 11:07 PM
కల్లీ కల్లు మృతులకు రూ.కోటి నష్ట పరిహారం చెల్లించాలి: ఎంపీ ఈటల Wed, Jul 09, 2025, 09:39 PM