బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై మాజీ ఎంపీ రవీంద్రనాయక్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు

byసూర్య | Sat, Oct 12, 2024, 02:33 PM

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై మాజీ ఎంపీ రవీంద్రనాయక్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉద్యమం ముసుగులో ఆయన అన్ని వర్గాల ప్రజలు, ఉద్యమకారులను మోసం చేశారని విమర్శించారు. ఆయన బాధితులు ఎంతోమంది ఉన్నారని తెలిపారు. టీఆర్ఎస్ ఆవిర్భావ సభ్యుడిగా ఉన్న తనను తెలంగాణ భవన్ నుంచి బయటకు గెంటివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేశారని ధ్వజమెత్తారు.చాలామంది నాయకుల రాజకీయ భవిష్యత్తుతో కేసీఆర్ ఆడుకున్నారని ఆరోపించారు. పార్టీ కోసం, తెలంగాణ కోసం ఉద్యమించిన వారిని బయటకు గెంటేశారని ఆరోపించారు. గిరిజనులు, మహిళలకు టికెట్లు ఇవ్వలేదన్నారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక క్విడ్‌ప్రో పేరుతో వేలాది ఎకరాల అసైన్డ్‌, నయీం, దేవాదాయ, వక్ఫ్‌, మిగులు భూములు కబ్జా చేయడమే కాకుండా వాటిని మాయం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో వందల చెరువులు కనుమరుగయ్యాయని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబంలో ఎవరు ముఖ్యమంత్రి అయినా తెలంగాణ నాశనమవుతుందని హెచ్చరించారు. కవిత జైలు పాలవడానికి కారణం కేసీఆరేనని అన్నారు. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డిపై రవీంద్రనాయక్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి ప్రజాపాలన చేస్తున్నారని కితాబునిచ్చారు. ఆయనకు రాష్ట్ర ప్రజలు అండగా ఉండాలని సూచించారు.


Latest News
 

కాళేశ్వరం అక్రమాలపై సుప్రీం మాజీ జడ్జి ఆధ్వర్యంలో కమిషన్ Fri, May 23, 2025, 08:34 PM
తెలంగాణలో సమీర్‌ ఉగ్ర కుట్ర కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని డీజీపీ జితేందర్‌ వెల్లడించారు Fri, May 23, 2025, 08:26 PM
ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు Fri, May 23, 2025, 07:32 PM
తర్వాత జరగబోయేది ఇదే: ఎంపీ రఘునందన్ రావు Fri, May 23, 2025, 07:26 PM
నిమ్జ్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు పట్టాలు Fri, May 23, 2025, 07:22 PM