byసూర్య | Sun, Sep 29, 2024, 10:46 PM
ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే. బర్లగూడెం గ్రామ పరిధిలోని యోగితానగర్ కు చెందిన నాగుల.
చందర్రావు ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. గ్రామస్తులు వెంటనే అంబులెన్స్ లో వెంకటాపురం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు.