byసూర్య | Sun, Sep 29, 2024, 08:06 PM
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఎస్సై ఆంజనేయులు అన్నారు. ఆదివారం నారాయణపేట పట్టణంలోని సుభాష్ రోడ్ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కాలని ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.
లాటరీ తగిలిందని కొంత డబ్బు జమ చేయాలని అంటూ వచ్చే ఫోన్ కాల్స్ పై స్పందించారదని, ఫోన్లకు వచ్చే అనవసరపు లింకులు ఓపెన్ చేయరాదని అన్నారు. సైబర్ మోసంలో ఆర్థికంగా నష్టపోతే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు.