కిడ్నీ రోగులకు .. రాష్ట్రంలో 18 కొత్త డయాలసిస్ సెంటర్లు

byసూర్య | Sun, Sep 29, 2024, 06:59 PM

తెలంగాణలోని కిడ్నీ రోగులకు బిగ్ రిలీఫ్. రాష్ట్రంలో కొత్తగా 18 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లకు ఊరట కల్పించేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 18 డయాలసిస్ సెంటర్లతో పాటుగా కొత్తగా 7 వాస్క్యులర్ సెంటర్ల ఏర్పాటుకు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. వీటితో పాటుగా.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డయాలసిస్ సెంటర్లలో అదనంగా 74 డయాలసిస్‌‌ యంత్రాలను ఆయా సెంటర్లలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు తెలంగాణ హెల్త్ సెక్రటరీ క్రిస్టినా ఉత్తర్వులు జారీ చేశారు.


రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్న రోగులకు డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి వారానికి రెండు నుంచి మూడు సార్లు డయాలసిస్‌‌ అవసరం. రాష్ట్రంలో చాలా మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఇక తొలిసారి డయాలసిస్‌‌ చేయాల్సి వచ్చినప్పుడు పేషెంట్‌కు మొదట ఒక సర్జరీ చేయాల్సి ఉంటుంది. డయాలసిస్‌‌కు యాక్సెస్‌‌ పాయింట్‌‌గా ఆ సర్జరీ చేస్తారు. సాధారణంగా చేతి మణికట్టు దగ్గర చేసే సర్జరీని రక్తప్రసరణ వ్యవస్థకు చికిత్స చేయడంలో నైపుణ్యం కలిగిన వ్యాస్కులర్‌‌ చేస్తారు.


ఎవరైనా పేషెంట్ ఒక్కసారి ఈ యాక్సెస్‌‌ పాయింట్‌‌ సర్జరీ చేయించుకుంటే.. ఆ తర్వాత డయాలసిస్‌‌ చేయటం చాలా ఈజీ అవుతుంది. ప్రస్తుతం ఈ వాస్క్యులర్‌‌ సర్జరీ చేయించుకోవడానికి కిడ్నీ పేషెంట్లు తప్పనిసరిగా హైదరాబాద్‌ నగరానికి‌ రావాల్సిన పరిస్థితి ఉంది. దీంతో మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉండేవారికి ఇది తలకు మించిన భారం. దానికి తోడు నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రోగులపై భారం పడకుండా చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా వాస్క్యులర్‌‌ యాక్సెస్‌‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. వరంగల్‌‌ ఎంజీఎం, మహబూబ్‌‌నగర్‌‌ జనరల్ హాస్పిటల్‌‌, ఖమ్మం జనరల్ హస్పిటల్, ఆదిలాబాద్ రిమ్స్‌‌లో ఈ వాస్క్యులర్ యాక్సెస్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.


ఇక హైదరాబాద్ నగరంలో డయాలసిస్‌‌ కోసం ఉస్మానియా, నిమ్స్‌‌, గాంధీ ఆసుపత్రకు రోగులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఆసుపత్రుల్లోనూ వీటిని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. మొత్తం 7 సెంటర్ల కోసం రూ.32.7 కోట్లను సర్కార్ కేటాయించింది. డయాలసిస్‌‌ కోసం తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 85 కేంద్రాలున్నప్పటికీ అవి సరిపోవటంతో కొత్తగా మరో 18 డయాలసిస్‌‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే ఉన్న సెంటర్లపై భారం తగ్గడంతో పాటుగా కొత్తగా ఏర్పాటయ్యే డయాలసిస్ సెంటర్లతో పేషెంట్లు ప్రయాణించాల్సిన దూరం కూడా తగ్గుతుందని వైద్యశాఖ అధికారులు అంటున్నారు.



Latest News
 

తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు Sun, Sep 29, 2024, 10:52 PM
అక్టోబర్ 3 నుంచే,,,,తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు Sun, Sep 29, 2024, 10:51 PM
తెలంగాణ ఆర్టీ తీపి కబురు.. దసరా నుంచి ఇంటింటికి, ఇక ఇబ్బందుల్లేవ్ Sun, Sep 29, 2024, 10:49 PM
నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. దసరాకు ఇలా అయితే కష్టమే Sun, Sep 29, 2024, 10:47 PM
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి Sun, Sep 29, 2024, 10:46 PM