byసూర్య | Fri, Sep 27, 2024, 07:43 PM
హైదరాబాద్లో ఓవైపు చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన కట్టడాలను హైడ్రా నేలమట్టం చేస్తుంటే.. మరోవైపు మతపరమైన కార్యక్రమాల్లో డీజేల వినియోగంపై నిషేధం విధించనున్నారంటూ చర్య నడుస్తుంటే.. ఇప్పుడు కొత్తగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాటా సంచలన ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లు బ్యాన్ చేస్తూ.. ఆమ్రపాలి కీలక ఆదేశాలు జారీ చేశారు. వాల్ పోస్టర్లతో పాటు వాల్ పెయింటింగ్స్పై కూడా సీరియస్గా వ్యవహరించాలని ఆమ్రపాలి సర్క్యులర్ జారీ చేశారు.
ఈ క్రమంలోనే.. సినిమా థియేటర్ వాళ్లు కూడా ఎక్కడా గోడలకు పోస్టర్లు అతికించకుండా చూడాలని డిప్యూటీ కమిషనర్లకు ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు. గోడలపై పోస్టర్లు అంటిస్తే జరిమానా విధించాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను సీరియస్గా అమలు చేయాలని అధికారులకు ఆమ్రపాలి సూచించారు. అయితే.. నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా. అయితే.. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఉత్తర్వుల్లో కమిషనర్ ఆమ్రపాలి పేర్కొన్నారు.