అక్టోబరు 31 వరకు ఆ మార్గాల్లో 12 రైళ్లు రద్దు

byసూర్య | Fri, Sep 27, 2024, 07:42 PM

నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దుచేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వివిధ మార్గాల్లో 12 రైళ్లు అక్టోబరు 1 నుంచి 31 వరకు రద్దుచేసినట్టు తెలిపింది. రద్దయిన ఈ రైళ్లలో దాదాపు అన్నీ ప్యాసింజర్లే. కాచిగూడ- నిజామాబాద్‌ (07596), నిజామాబాద్‌- కాచిగూడ (07593), మేడ్చల్‌- లింగంపల్లి (47222), లింగంపల్లి- మేడ్చల్‌ (47225), మేడ్చల్‌- సికింద్రాబాద్‌ (47235), సికింద్రాబాద్‌- మేడ్చల్‌ (47236), మేడ్చల్‌- సికింద్రాబాద్‌ (47237), సికింద్రాబాద్‌- మేడ్చల్‌ (47238) మేడ్చల్‌- సికింద్రాబాద్‌ (47242), సికింద్రాబాద్‌- మేడ్చల్‌ (47245), మేడ్చల్‌- సికింద్రాబాద్‌ (47228), సికింద్రాబాద్‌- మేడ్చల్‌ (47229) రైళ్లు అక్టోబరు 1 నుంచి అదే నెల 31వ తేదీ వరకు అందుబాటులో ఉండవని, ప్రయాణికులు దీనిని గమనించాలని పేర్కొంది.


వీటితో పాటు కాచిగూడ-మెదక్‌ రైలు (07850)ను కాచిగూడ-మల్కాజిగిరి మధ్య అక్టోబరు 1 నుంచి 31 వరకు పాక్షికంగా రద్దు చేసినట్లు చెప్పింది. మరోవైపు, దసరా, దీపావళి పండగల నేపథ్యలో రైల్వే శాఖ పలు ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాంతాలకు నడుపుతోంది. కాచిగూడ, సికింద్రాబాద్‌ స్టేషన్ల నుంచి తిరుపతికి అక్టోబరు 1 నుంచి నవంబరు 16 వరకు ప్రత్యేక రైళ్లను నడుపుతోన్నట్టు దక్షిణ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఏఏ తేదీల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయో వివరాలను వెల్లడించింది.


కాచిగూడ- సికింద్రాబాద్‌ (07063) ఏడు సర్వీసులు, తిరుపతి- కాచిగూడ (07064) ఏడు సర్వీసులు, సికింద్రాబాద్‌- తిరుపతి (07041) 14 సర్వీసులు, తిరుపతి- సికింద్రాబాద్‌ (07042) 14 సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే జోన్ సీపీఆర్వో ఎ. శ్రీధర్‌ పేర్కొన్నారు.


అక్టోబరు 2, 4, 9, 11, 16, 18, 23, 25, 30, నవంబరు 1, 6, 13, 15న రైలు నెంబరు 07041 సికింద్రాబాద్ నుంచి తిరుపతికి.. అదే తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు రైలు నెంబరు 07042.. అక్టోబరు 3, 5, 10, 12, 17, 19, 24, 26, 31, నవంబరు 2,7, 9 14, 16 అందుబాటులో ఉంటుంది. ఈ రైలు జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా తిరుపతికి చేరుకుంటుంది.


అక్టోబరు 1, 8, 15, 22, 29న, నవంబరు 5, 12న రైలు నెంబరు 07063 కాచిగూడ నుంచి తిరుపతికి.. అదే తిరుపతి నుంచి కాచిగూడకు రైలు నెంబరు 07064.. అక్టోబరు 2, 9, 16, 23, నవంబరు 6, 13న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్డు, గద్వాల, కర్నూలు టౌన్, డోన్, గుత్తి, యర్రగుంట్ల,కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.


Latest News
 

చూపు మందగించిందని హాస్పిటల్ వెళితే.. కన్నే తీసేశారు Fri, Sep 27, 2024, 09:07 PM
హాలీవుడ్‌లో కరీనంగర్ కుర్రాడి సత్తా.. 14 రోజుల్లోనే సినిమా Fri, Sep 27, 2024, 09:04 PM
తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మాధవీలత భజనా కార్యక్రమం.. ఆశ్చర్యంలో ప్రయాణికులు Fri, Sep 27, 2024, 09:02 PM
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే లైసెన్సుల రద్దు,,,,కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశం Fri, Sep 27, 2024, 08:58 PM
తెలంగాణకు రిలయన్స్ ఫౌండేషన్ భూరి విరాళం.. ఏకంగా రూ.20 కోట్లు Fri, Sep 27, 2024, 08:56 PM