ఆ భవనాన్ని ఎలా కూలుస్తారు.. హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు

byసూర్య | Fri, Sep 27, 2024, 06:56 PM

హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలే లక్ష్యంగా హైడ్రా బుల్డోజర్లు దూసుకెళ్తున్నాయి. నగరవ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటల్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లోని కట్టడాలతో పాటు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించేది సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు, సామాన్యులు ఇలా ఎవరైనా సరే.. నిర్ధాక్షిణ్యంగా కూల్చివేయటమే అన్నట్టుగా బుల్డోజర్లు పంజా విసురుతున్నాయి. ఈ క్రమంలో.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌‌కు హైకోర్టు కీలక ఆదేశాలు చేసింది. వచ్చే సోమవారం (సెప్టెంబర్ 30వ తేదీన) ఉదయం 10.30 గంటలకు కోర్డు ఎదుట హాజరవ్వాలంటూ రంగనాథ్‌ను ఆదేశించింది.


ఇటీవల అమీన్‌పూర్‌లో ఓ భవనాన్ని హైడ్రా కూల్చివేయగా.. కోర్టులో పెండింగ్‌లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారంటూ హైకోర్టు ప్రశ్నించారు. ఈ విషయం మీద.. వ్యక్తిగతంగానైనా లేదా వర్చువల్‌గానైనా కోర్టుకు సమాధానం చెప్పాలని ఉన్నత న్యాయస్థానం హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ని ఆదేశించింది. హైదరాబాద్‌లో ఓవైపు హైడ్రా కూల్చివేతలు జోరుగా సాగుతుండగా.. మరోవైపు మూసీ పరివాహక ప్రాంతాల్లోని నివాసాలకు మార్కింగ్ జరుగుతున్న నేపథ్యంలో.. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేయటం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


ఇటీవల.. కూకట్ పల్లి నల్ల చెరువు ఆక్రమణలను, అమీన్ పూర్‌లో నిర్మించిన పలు విల్లాలను హైడ్రా కూల్చివేసింది. అయితే.. ఈ కూల్చివేతలు సర్వత్రా వివాదాస్పదంగా మారాయి. కూకట్ పల్లి నల్లచెరువు పరిధిలోని నిర్మాణాలు సుమారు అన్నీ.. స్థలాలు లీజుకు తీసుకుని అందులో చిన్న చిన్న వ్యాపారాలు నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. అమీన్ పూర్‌ కూల్చివేతల్లో మాత్రం దాదాపు నివాస గృహాలే ఉండటం గమనార్హం. అందులోనూ.. చాలా మంది బ్యాంకుల్లో లోన్లు తీసుకుని మరీ.. ఇండ్లు నిర్మించుకున్నామంటూ బోరుమన్నారు.


ఒకరేమో.. కూల్చేందుకు వారం రోజుల ముందే గృహప్రవేశం చేశామంటూ కన్నీల్లు పెట్టుకోగా.. మరొకరు మూడు రోజుల కిందే రిజిస్ట్రేషన్ చేపించుకున్నామని చెప్తూ గోడు వెళ్లబోసుకున్నారు. బ్యాంకుల్లో లక్షలు లక్షలు లోన్లు తీసుకొచ్చుకుని.. కలల సౌధం నిర్మించుకుంటే.. కళ్ల ముందే నేలమట్టం చేశారని గుండెలు బాదుకున్నారు. తాము బిల్డర్ల దగ్గర కొనుక్కుని ఇండ్లు కట్టుకున్నామని.. తాము ఇండ్లు కట్టుకునేందుకు అన్ని రకాల అనుమతులు ఇచ్చారని చెప్పారు. ఇప్పుడేమో ఇది ఎఫ్టీఎల్, బఫర్ జోన్ అంటూ నిర్ధాక్షిణ్యంగా కూల్చివేయటం దారుణమని.. బాధపడ్డారు.



Latest News
 

తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మాధవీలత భజనా కార్యక్రమం.. ఆశ్చర్యంలో ప్రయాణికులు Fri, Sep 27, 2024, 09:02 PM
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే లైసెన్సుల రద్దు,,,,కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశం Fri, Sep 27, 2024, 08:58 PM
తెలంగాణకు రిలయన్స్ ఫౌండేషన్ భూరి విరాళం.. ఏకంగా రూ.20 కోట్లు Fri, Sep 27, 2024, 08:56 PM
హైదరాబాద్‌లో అవన్నీ బ్యాన్.. ఆమ్రపాలి సంచలన నిర్ణయం Fri, Sep 27, 2024, 07:43 PM
అక్టోబరు 31 వరకు ఆ మార్గాల్లో 12 రైళ్లు రద్దు Fri, Sep 27, 2024, 07:42 PM