108 అత్యవసర నూతన అంబులెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం

byసూర్య | Fri, Sep 27, 2024, 04:39 PM

డిండి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 108 అత్యవసర నూతన అంబులెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై,వేద పండితులచే ప్రత్యేక పూజలు నిర్వహించి 108 అత్యవసర అంబులెన్స్ సేవలను ప్రారంభించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్.ఈసందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ..ప్రజారోగ్యానికి ప్రాధాన్యత,తక్షణ వైద్య సేవలకు 108 అంబులెన్స్ సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.పేద ప్రజల ఆరోగ్య సేవలకు అత్యవసర వాహన సేవలు అవసరమన్నారు.ప్రజలందరూ 108 సేవలు వినియోగించాలన్నారు.
108  వాహనాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వర్ రావు,మండల పార్టీ అధ్యక్షులు రాజేష్ రెడ్డి,ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ప్రజల ఆమోదం తీసుకున్నాకే ప్రక్షాళన చేపట్టాలని పటోళ్ల కార్తీక్ రెడ్డి సూచన Fri, Sep 27, 2024, 06:38 PM
ఆకాశన్నంటిన ఉల్లి ధరలు Fri, Sep 27, 2024, 05:19 PM
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిలో పాల్గొన్న ఫోరం నాయకులు Fri, Sep 27, 2024, 05:12 PM
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు Fri, Sep 27, 2024, 05:09 PM
సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే Fri, Sep 27, 2024, 05:05 PM