byసూర్య | Fri, Sep 27, 2024, 03:22 PM
చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని నెక్కొండ చెరువు కట్ట మత్తడి వద్ద గుండ్రపల్లి గ్రామ వాస్తవ్యులు గ్రీన్ ఇండియా చాలెంజ్ జీవవైవిద్య మహానంది జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ వన ప్రేమికుడు నల్లగొండ సమ్మయ్య మర్రి మొక్క నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృక్షో రక్షతి రక్షిత.
నేడు నేను నాటినది మర్రి మొక్క మాత్రమే కానీ భవిష్యత్తు తరాలకు వటవృక్షం కావాలని మానవాళి ప్రాణవాయువు పశుపక్ష జాతులకు గాలి నీడ ఫలములు అందించాలని భగవంతుని వేడుకున్నారు. అట్లాగే తెలంగాణ సమాజానికి చాకలి ఐలమ్మ వారు అందించిన సామాజిక ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకొని ఆ మహనీయురాలికి వన ప్రేమికుడు సమ్మయ్య ఘన నివాళులర్పించారు.