ముఖ్యమంత్రి సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం

byసూర్య | Fri, Sep 27, 2024, 11:24 AM

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. మున్నేరు వాగు పొంగి పొర్లడంతో వరద ప్రభావిత ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.ఆ ప్రాంతాల పునరుద్ధరణ నిమిత్తం పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు విరాళాలు అందజేస్తున్నారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు పలువురు విరాళాలు అందించేందుకు స్వచ్చంధంగా ముందుకువస్తున్నారు.ఈ క్రమంలోనే తెలంగాణ సీఎంఆర్ఎఫ్‌కు రిలయన్స్ ఫౌండేషన్ రూ.20 కోట్ల విరాళం అందజేసింది.ఈ మేరకు నీతా అంబానీ తరపున రిలయన్స్ ప్రతినిధులు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.ముంపు గ్రామాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పన కోసం ఈ నిధులను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.


Latest News
 

ఎంపిడిఓ లకు వినతి పత్రం ఇచ్చిన సర్పంచులు Fri, Sep 27, 2024, 03:01 PM
పెద్దపల్లి మండలంలో ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ Fri, Sep 27, 2024, 02:48 PM
క్రీడోత్సవాలను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ Fri, Sep 27, 2024, 02:45 PM
పేదల ఇళ్లను కూలగొడితే జైలు పాలవ్వడం ఖాయం: ఈటెల రాజేందర్ Fri, Sep 27, 2024, 02:42 PM
ఈ ఏడాది బతుకమ్మ పండుగ డేట్స్ ఇవే Fri, Sep 27, 2024, 02:38 PM