byసూర్య | Fri, Sep 27, 2024, 11:08 AM
తెలంగాణలో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఏకంగా మంత్రి నివాసంలోనే సోదాలు చేయడం రాజకీయంగా కూడా కాక రేపుతోంది.సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో తనిఖీలు సంచలనంగా మారుతున్నాయి. ఈ ఉదయం నుంచి ఏక కాలంలో 16 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్డైరెక్టరేట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సీఆర్పీఎఫ్ భద్రత మధ్య సోదాలు జరుగుతున్నాయి.