హైదరాబాద్ లో ఆందోళన కార్యక్రమం చేపట్టిన బీజేపీ ప్రకాశ్ రాజ్ దిష్టిబొమ్మ దగ్ధం

byసూర్య | Thu, Sep 26, 2024, 06:31 PM

కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ చేస్తున్న వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రకాశ్ రాజ్ వ్యవహారశైలిని తప్పుపడుతూ హైదరాబాద్ లో ఈరోజు బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. సనాతన ధర్మంపై ప్రకాశ్ రాజ్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నుంచి ప్రకాశ్ రాజ్ ను బహిష్కరించాలని వారు కోరారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ప్రకాశ్ రాజ్ వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.


Latest News
 

పల్లె దవాఖానా పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే Fri, Sep 27, 2024, 04:41 PM
108 అత్యవసర నూతన అంబులెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం Fri, Sep 27, 2024, 04:39 PM
అందోలు చెరువు అభివృద్ది పనులను పరిశీలించిన ఈఈ Fri, Sep 27, 2024, 04:36 PM
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది Fri, Sep 27, 2024, 04:30 PM
బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం Fri, Sep 27, 2024, 04:27 PM