బుగ్గార మండల కేంద్రంలో ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

byసూర్య | Thu, Sep 26, 2024, 04:26 PM

జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో సభ వేదిక ఏర్పాటు చేసిన ధర్మపురి శాసనసభ అధ్యక్షులు ఎమ్మెల్యే విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అర్హులైన వారందరికీ కళ్యాణ లక్ష్మి చెక్కులు 29 లక్షల విలువ గల 28 చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మిగతా కళ్యాణ చెక్కులు రానివారు  ఎలాంటి దిగులు చెందే అవసరం లేదు, మరో విడతల అర్హులైన వారందరికీ త్వరలోనే చెక్కుల పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను కూడా అమలు చేసి తీరుతామని కూడా తెలిపారు. ఇటీవల రైతులకు రెండు లక్షల రుణమాఫీ కాని రైతులు సంబంధిత అధికారులకు దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. త్వరలోనే రుణమాఫీ తప్పనిసరి చేస్తామని, త్వరలోనే రేషన్ కార్డు లేని వారికి కూడా రేషన్ కార్డు పంపిణీ చేసి సన్న బియ్యం పంపిణీ చేస్తామని దానిపైన ప్రభుత్వ కసరత్తు చేస్తుందని సభ ముఖంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు రెవెన్యూ సిబ్బంది మరియు ఎంపీడీవో సిబ్బంది  కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

చూపు మందగించిందని హాస్పిటల్ వెళితే.. కన్నే తీసేశారు Fri, Sep 27, 2024, 09:07 PM
హాలీవుడ్‌లో కరీనంగర్ కుర్రాడి సత్తా.. 14 రోజుల్లోనే సినిమా Fri, Sep 27, 2024, 09:04 PM
తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మాధవీలత భజనా కార్యక్రమం.. ఆశ్చర్యంలో ప్రయాణికులు Fri, Sep 27, 2024, 09:02 PM
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే లైసెన్సుల రద్దు,,,,కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశం Fri, Sep 27, 2024, 08:58 PM
తెలంగాణకు రిలయన్స్ ఫౌండేషన్ భూరి విరాళం.. ఏకంగా రూ.20 కోట్లు Fri, Sep 27, 2024, 08:56 PM