లైన్ మెన్ నిర్లక్ష్యానికి యువకుడు షాక్ తో మృతి

byసూర్య | Thu, Sep 26, 2024, 04:17 PM

జూనియర్ లైన్ మెన్ నిర్లక్ష్యానికి యువకుడు షాక్ కు గురై మృతి చెందిన ఘటన అక్కన్నపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...సిద్దిపేట జిల్లా  లోని కొండాపూర్  గ్రామానికి చెందిన  ప్రైవేట్ ఎలక్ట్రిషన్ తిరుపతి (29) కి మంగళవారం విద్యుత్ మరమ్మత్తు కోసం కపూర్ నాయక్ తండాలోని పోల్ ఎక్కమని జూనియర్ లైన్ మెన్ రాజేందర్ చెప్పాడు. కాగా అక్కన్నపేట మండలం రామవరం లో ఉన్న నాలుగు ఫీడర్లలో కపూర్ నాయక్ తండ ఫీడర్ కు బదులు రామవరం రూరల్ ఫీడర్ బ్రేక్ డౌన్ చేశాడు.
దీంతో పోల్ ఎక్కిన తిరుపతి విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలిసిన జూనియర్ లైన్ మెన్ విద్యుత్ అధికారులకు గానీ పోలీసులకు గాని దొరకకుండా పరారీలో ఉన్నాడు. దీంతో చనిపోయిన తిరుపతి బంధువులు అకారణంగా జూనియర్ లైన్ మెన్ నిర్లక్ష్యానికి బలయ్యాడని కన్నీరు మున్నీరు రాత్రి నుండి మృతదేహాన్ని తీయకుండా ఘటనా స్థలంలోనే ఆందోళన చేపట్టారు. బుధవారం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు.విధులపై నిర్లక్ష్యం వహించిన జూనియర్ పై చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు వచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తిరుపతి అవివాహితుడు. రెండు రోజుల్లో ఎంగేజ్మెంట్ ఉండగా ఇంతలోనే విద్యుత్ షాక్ కు గురై చనిపోవడంతో కపూర్ నాయక్ తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Latest News
 

చూపు మందగించిందని హాస్పిటల్ వెళితే.. కన్నే తీసేశారు Fri, Sep 27, 2024, 09:07 PM
హాలీవుడ్‌లో కరీనంగర్ కుర్రాడి సత్తా.. 14 రోజుల్లోనే సినిమా Fri, Sep 27, 2024, 09:04 PM
తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మాధవీలత భజనా కార్యక్రమం.. ఆశ్చర్యంలో ప్రయాణికులు Fri, Sep 27, 2024, 09:02 PM
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే లైసెన్సుల రద్దు,,,,కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశం Fri, Sep 27, 2024, 08:58 PM
తెలంగాణకు రిలయన్స్ ఫౌండేషన్ భూరి విరాళం.. ఏకంగా రూ.20 కోట్లు Fri, Sep 27, 2024, 08:56 PM