దుబ్బాకలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం

byసూర్య | Thu, Sep 26, 2024, 03:17 PM

దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాట జరిగింది. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాకలో ఈరోజు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్ రావు, స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఇంఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.అయితే అధికారిక కార్యక్రమానికి శ్రీనివాస్ రెడ్డి హాజరు కావడాన్ని బీఆర్ఎస్ వర్గాలు తప్పుబట్టాయి. వేదికపై శ్రీనివాస్ రెడ్డి ఉండవద్దని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రోటోకాల్ పాటించాలని సూచించారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నాయకులతో పాటు బీజేపీ నేతలు కూడా పోటాపోటీ నినాదాలు చేశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. చివరకు అధికారిక కార్యక్రమం కావడంతో వేదిక మీది నుంచి శ్రీనివాస్ రెడ్డి దిగిపోయారు. రసాభాస మధ్య మంత్రి సురేఖ చెక్కులను పంపిణీ చేశారు.


Latest News
 

తెలంగాణ మహిళల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది: సీఎం Sun, Sep 29, 2024, 04:02 PM
సిద్దిపేట జిల్లా గురువన్నపేటలో ఉద్రిక్తత Sun, Sep 29, 2024, 03:13 PM
జిల్లాను మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చాలి: కలెక్టర్ Sun, Sep 29, 2024, 10:09 AM
గచ్చిబౌలిలో పింక్ పవర్ రన్-2024.. Sun, Sep 29, 2024, 09:31 AM
సింగూరు ప్రాజెక్టులోకి వరద నీరు Sun, Sep 29, 2024, 09:28 AM