మూసీ నదిపై కొత్తగా 15 వంతెనలు..ఈ ప్రాంతాల్లోనే, ట్రాఫిక్ సమస్యలకు చెక్.

byసూర్య | Wed, Sep 25, 2024, 07:29 PM

హైదరాబాద్ నడిబొడ్డున ప్రవహించే మూసీ నది సుందరీకరణపై రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధికి చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా మూసీ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు గుర్తించి అక్రమ కట్టడాలను నేలమట్టం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే 10,200 అక్రమణలు గుర్తించి కూల్చేందుకు హైడ్రాను రంగంలోకి దింపుతున్నారు. మూసీ బాధితులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.


ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను వేగవంతం చేసింది సర్కార్. ఇప్పటికే మూసీ పరీవాహక ప్రాంతాలను సర్వే చేసిన అధికారులు తాజాగా మూసీ నదిపై నిజాం కాలంలో నిర్మించిన బ్రిడ్జిల పటిష్టతపై పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది. మెుత్తం 58 కిలోమీటర్లు ఉన్న మూసీ నదిపై నిర్మించిన బ్రిడ్జిలను పరీక్షించనున్నారు. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ వంతెనలు పటిష్ఠంగా ఉన్నాయా..? లేవా..? ఇంకా ఎంత కాలం తట్టుకుని నిలబడగలవు..? లాంటి అంశాలను పరిశీలించేందుకు ప్రభుత్వం తాజాగా ఏజెన్సీని నియమించింది.


ముంబైకి చెందిన స్ట్రక్ట్ వెల్ డిజైనర్స్ అండ్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి మూసీ నదిపై నిర్మించిన బ్రిడ్జిలను పరిశీలించనుంది. బ్రిడ్జిల పటిష్టతను పరిశీలించడానికి సదరు కంపెనీ రీబౌండ్ హ్యామర్ టెస్ట్, గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్, డైనమిక్ లోడ్ టెస్టింగ్ నిర్వహించనుంది. నాగోల్, ఇమ్లిబన్, ముస్లింజంగ్, నయాపూల్, పురాణాపూల్, టిప్పు ఖాన్, బాపూఘాట్, అత్తాపూర్, చాదర్ఘాట్, గోల్నాక, సాలార్జంగ్ ప్రాంతాల్లో నిర్మించిన బ్రిడ్జిలను పరిశీలించనున్నారు.


ఈ వంతెనలు మెుత్తం నిజాం కాలంలో నిర్మించినవి కావడం, వాటికి చారిత్రక నేపథ్యం ఉండడంతో లోపాలు ఉంటే వాటిని పూర్తిగా కూల్చడం కంటే.. వారసత్వ కట్టడాలుగా గుర్తించి రిపేర్లు చేయడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఆయా కట్టడాల్లో లోపాలు ఉంటే పక్కనే కొత్తగా బ్రిడ్జిలు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయా మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండగా.. కొత్త బ్రిడ్జిలు అందుబాటులో వస్తే ట్రాఫిక్ కష్టాలు తీరిపోనున్నాయి.


ఈ వారంలో అక్రమణల కూల్చివేత


ఇక హైడ్రా బుల్డోజర్లు మూసీ పరివాహాక ప్రాంతం వైపు దూసుకెళ్లనున్నాయి. ఈ వారాంతంలో మూసీ ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ శని, ఆదివారాల్లో భారీగా మూసీ ఆక్రమణలను కూల్చివేయనున్నట్లు సమాచారం. ఆ రెండు రోజుల్లోనే ఆక్రమణలను పూర్తిగా నేలమట్టం చేసేలా అధికారులు టార్గెట్‌గా పెట్టుకున్టన్లు తెలుస్తోంది. గోల్నాక, చాదర్‌ఘాట్, మూసారంబాగ్ తదితర ప్రాంతాల్లో ముందుగా ఆక్రమణల కూల్చివేతలు చేపట్టనున్నట్లు సమాచారం.


Latest News
 

ఫార్మా సిటీని రద్దు చేయడం లేదని ప్రభుత్వం హైకోర్టుకు చెప్పిందన్న కేటీఆర్ Thu, Sep 26, 2024, 08:37 PM
అధికారులు జీవితంలో ఏ తప్పు చేయకూడదో కాళేశ్వరం ఉదాహరణ అన్న సీఎం Thu, Sep 26, 2024, 07:37 PM
మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం నుంచి డిమాండ్ వస్తున్నట్లు మంత్రి సీతక్క వెల్లడి Thu, Sep 26, 2024, 07:35 PM
లాడ్జిలో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య Thu, Sep 26, 2024, 07:14 PM
పేదలకు అన్యాయం జరగకుండా అండగా ఉంటాం: ఎమ్మేల్యే Thu, Sep 26, 2024, 07:13 PM