|
|
byసూర్య | Tue, Aug 06, 2024, 02:47 PM
బేల మండలం మసాలా (బి) గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బండి సుజాత సుదర్శన్ మంగళవారం బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వారి తో పాటు మసాల, భాది, ఏటి గ్రామస్తులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు.