గదిలో బంధించి 20 కుక్కల్ని వదిలి.. 3 రోజులు చిత్రహింసలు

byసూర్య | Sun, Jul 14, 2024, 07:38 PM

హైదరాబాద్‌లో ఎంఆర్పీఎస్ నేత నరేందర్ కిడ్నాప్ కేసు సంచలనం సృష్టిస్తోంది. కిడ్నాప్ అయిన 3 రోజుల ఉత్కంఠ తర్వాత.. కిడ్నాపర్ల నుంచి నరేందర్ సురక్షితంగా బయటపడ్డారు. అయితే.. కిడ్నాప్‌కు సంబంధించిన షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే.. నరేందర్‌ను నిర్బంధిన ఫాంహౌస్‌ను సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. శంషాబాద్ దర్మగిరిగుట్ట ఆలయానికి దగ్గరలో ఉన్న ఈ ఫాంహౌస్‌లో పెద్ద మొత్తంలో కుక్కలు, గుర్రాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఫాంహౌస్ లోపలికి ఎవరు రాకుండా ఉండేందుకు ఎత్తయిన గోడలు నిర్మించారని.. అంతేకాకుండా భారీ సంఖ్యలో కుక్కలను కూడా కాపలా పెట్టినట్టు సమాచారం.


అయితే.. కిడ్నాప్ చేసిన ఎంఆర్పీఎస్ నాయకులను కిడ్నాపర్లు దారుణంగా హింసించినట్టు తెలుస్తోంది. 3 రోజుల పాటు ఫాంహౌస్‌లో నరేందర్‌ని పెట్టి హింసించినట్టు సమాచారం. నరేందర్‌ని ఓ గదిలో బందించి.. 20 కుక్కల్ని వదిలిపెట్టి చిత్ర హింసలు పెట్టినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. తన చేతిని విరిచేసి.. హింసించినట్టు సమాచారం. అయితే.. ప్రస్తుతం నరేందర్‌ సురక్షితంగా బయటపడగా.. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.


అయితే.. ఓ భూవివాదం విషయంలోనే.. నరేందర్‌ను కిడ్నాప్ చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో విచారణ మొదలుపెట్టారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బృందావన్‌ కాలనీలోని కోట్లు విలువ చేసే ఓ స్థలం విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ నడుస్తోంది. ఈ వివాదంపై మాట్లాడేందుకు గండిపేట మండలం నెక్నాంపూర్‌‌కి చెందిన ఎమ్మార్పీఎస్‌ నాయకుడు రామేశ్వరం నరేందర్, తన అనుచరుడు ప్రవీణ్‌ కుమార్‌తో కలిసి స్థలం వద్దకు రావాలని కోరారు. అయితే.. అక్కడికి వెళ్లిన ఇద్దరూ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్ ఆధారంగా వెతికినా ఫలితం దక్కలేదు. కిడ్నాప్‌కు గురైనట్టు గుర్తించిన పోలీసులు ఆ దిశగా విచారణ చేశారు.


ఈ క్రమంలోనే.. వివాద స్థలం దగ్గరికి వెళ్ల్తే ఏమైనా ఆధారం దొరుకుంతుందేమోనని వెళ్లగా.. అక్కడ పెద్ద ఎత్తున గుమిగూడి ఉన్నారు. ఏమైందని పోలీసులు అడగటంతో.. ఒక్కసారిగా కత్తులు, హకీ స్టిక్కులతో దాడికి సిద్ధమయ్యారు. దీంతో.. వెంటనే అదనపు బలగాలను రంగంలోకి దింపగా.. అక్కడున్న రౌడీ మూకలు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే.. అహ్మద్‌ఖాన్, షేక్‌ హమ్దన్, మహ్మద్‌ జాఫర్, మసూద్‌ను పట్టుకుని స్టేషన్‌కు తరలించారు.


అయితే.. ఈ కిడ్నాప్ కేసులోనూ ఈ నలుగురి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. వీళ్లపై గతంలో పలు చోరీ కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. 3 రోజులుగా ఆచూకీ లేని నరేందర్, ప్రవీణ్‌ కుమార్‌‌ను.. కిడ్నాపర్లు శనివారం ఉదయం ఇంటి సమీపంలో వదిలిపెట్టారు. అయితే.. మూడు రోజుల పాటు వీళ్లిద్దరినీ ఆయా ప్రాంతాల్లో తిప్పుతూ హింసించినట్టు తెలుస్తోంది. దీంతో.. నిందితులు ఎవరన్నది పోలీసులు తెలుసుకునే పనిలో పడ్డారు.


Latest News
 

ఇక వర్షాలే..ఎండ తీవ్రత నుంచి ఉపశమనం Sun, Mar 16, 2025, 07:33 PM
తెలంగాణ యువతకు .. ఒక్కొక్కరికి రూ. 3 నుంచి 5 లక్షలు Sun, Mar 16, 2025, 06:12 PM
అర్ధరాత్రి వేళ ప్రవేశించిన ఆగంతకుడు..బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో కలకలం Sun, Mar 16, 2025, 05:50 PM
మా ప్రభుత్వం వచ్చాకే.. వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్, రింగ్‌రోడ్డు ... సీఎం రేవంత్‌రెడ్డి Sun, Mar 16, 2025, 05:47 PM
పీఎం ఆవాస్ యోజన పథకం.. వెబ్‌సైట్లో లబ్ధిదారుల లిస్ట్.. Sun, Mar 16, 2025, 05:43 PM