సొంత చెల్లినే గర్భవతిని చేసిన కామాంధుడు

byసూర్య | Sun, Jul 14, 2024, 07:35 PM

సమాజం ఎటుపోతోంది. జనాల్లో విచక్షణ పూర్తిగా లోపిస్తోంది. కామా తురాణం న భయం.. న లజ్జా.. న బంధం.. అన్నట్టుగా మారిపోయింది. కామంతో కళ్లు మూసుకుపోయి.. మృగాలలా ప్రవర్తిస్తున్నారు. వయసు బేధం లేకుండా, వావి వరసలు మర్చిపోయి.. పశువుల్లా ఎగబడిపోతున్నారు. ఒకడేమో కన్న కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడితే.. మరొకడు సొంత చెల్లినే గర్భవతిని చేశాడు. ఈ అమానవీయ, జుగుప్స కలిగించే ఘటన.. నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. బిజినపల్లి మండలం కీమ్యాతాండలో ఓ మహిళ.. తన కుమారుడు, కుమార్తెతో నివాసముంటోంది.


అయితే.. సమాజంలో విచ్చలవిడితనం పెరిగిపోవటమో, సినిమాల ప్రభావమో కారణమేదైనా.. తనలోని కామాంధుడు విచక్షణ కోల్పేయేలా చేశాడు. సమాజంలో తిరుగుతున్న మానవ మృగాళ్ల నుంచి తన చెల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అన్నే.. కాటేశాడు. తన సొంత చెల్లి అన్న విషయాన్ని కూడా పక్కనపెట్టి.. పశువులా ప్రవర్తించాడు. 13 ఏళ్ల వయసు ఉన్న సొంత చెల్లికి మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఆ బాలిక గర్భం దాల్చటంతో ఈ జుగుప్సకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.


15 రోజుల క్రితం వనపర్తి జిల్లా గోపాలపేట మండలం బుద్దరం అటవీ ప్రాంతంలో ఈ అన్నాచెల్లెళ్లు తిరిగినట్లు తెలిసింది. ఆ తర్వాత రోజున ఖిల్లాఘనపురంలో నడుచుకుంటూ వెళ్తుంటే స్థానికులకు అనుమానం వచ్చి 1098 చైల్డ్ లైన్‌కి సమాచారం ఇచ్చారు. దీంతో.. వనపర్తి చైల్డ్ లైన్ అధికారులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి మహబూబ్‌నగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కి కేసును బదిలీ చేశారు. అక్కడి పోలీసులు బిజినపల్లి పోలీసులకు బదిలీ చేశారు.


బాలికకు వైద్య పరీక్షల నిమిత్తం నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు బిజినపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన బయటికిరావటంతో.. చాలా మంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సమాజం ఏమైపోతోందని చింతిస్తున్నారు. ఓవైపు కన్నతండ్రులే తమ కూతుర్లపై పశువుల్లా ప్రవర్తిస్తుంటే.. ఇప్పుడు సొంత సోదరులే ఇలా తెగబడిపోతుంటే.. ఇక అమ్మాయిలు ఎలా, ఎక్కడ మనుగడ కొనసాగిస్తారు. సొంత ఇంట్లోనే.. సొంత మనుషులే కామాంధులై ఎగబడుతుంటే.. ఇక వాళ్లకు రక్షణ ఎక్కడ దొరుకుతుందన్నది ఇప్పుడు సమాజాన్ని నిలదీస్తున్న ప్రధాన ప్రశ్న..!



Latest News
 

వాహనదారులు మధ్య ఘర్షణ.. భారీ ట్రాఫిక్ జామ్ Mon, May 19, 2025, 10:44 AM
పిడుగు పడి యువకుడి మృతి Mon, May 19, 2025, 10:41 AM
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యం ధరలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు Sun, May 18, 2025, 08:53 PM
మైలార్‌దేవ్‌పల్లిలో మూడంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు Sun, May 18, 2025, 08:34 PM
మరో నెలపాటు ధాన్యం కొనుగోళ్లు Sun, May 18, 2025, 07:41 PM