![]() |
![]() |
byసూర్య | Sun, Jul 14, 2024, 06:58 PM
ఇళ్ళు, ఇళ్ల స్థలాల కోసం పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ పిలుపునిచ్చారు. ఆదివారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని మల్లెలగట్టు కాలనీలో ఆ సంఘం సభ్యత్వం నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా కాలయాపన చేయకుండా తక్షణమే పేదలకు ఇళ్లను మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సువాసిని, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.