byసూర్య | Thu, Jun 08, 2023, 09:30 PM
యంగ్ హీరో శర్వానంద్, రక్షి రెడ్డి వివాహం జూన్ 3న జరిగింది. జైపూర్లోని లీలా ప్యాలెస్లో జరిగిన శర్వానంద్ వివాహ వేడుకకు రామ్చరణ్, సిద్ధార్థ్, అదితి రావ్ హైదరి మరియు ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యారు. కాగా, జూన్ 9న హైదరాబాద్లో శర్వానంద్ ఫ్యామిలీ రిసెప్షన్ గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శర్వానంద్ ఈరోజు సీఎం కేసీఆర్ని కలిశారు. రిసెప్షన్కు రావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించారు.