byసూర్య | Thu, Jun 08, 2023, 08:59 PM
తెలుగు రాష్ట్రాల్లో 17 మెడికల్ కాలేజీలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమహేంద్రవరం, విజయనగరం జిల్లాల్లో మొత్తం 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో మేడ్చల్, వరంగల్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, నిర్మల్, సిరిసిల్ల, వికారాబాద్, జనగాం, హైదరాబాద్లో కొత్తగా 12 కాలేజీల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది.