byసూర్య | Thu, Jun 08, 2023, 08:54 PM
తెలంగాణలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఎంటెక్, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీ ఇంజినీరింగ్ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను గురువారం మధ్యాహ్నం పీజీఈసెట్ స్టేట్ బోర్డ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, జేఎన్టీయూహెచ్ వీసీ ఆచార్య కట్టా నర్సింహారెడ్డి విడుదల చేశారు. మే 29 నుంచి జూన్ 1 వరకు 19 సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు జరిగాయి.