byసూర్య | Thu, Jun 08, 2023, 03:55 PM
ఆర్మూర్ మండలంలోని చేపూర్, గోవింద్ పెట్ గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం చెరువుల పండుగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే కు గ్రామ ప్రజలు పార్టీ నేతలు అపూర్వ స్వాగతం పలికారు. బోనాలు బతుకమ్మలతో ఊరేగింపుగా చెరువుల వద్దకు చేరుకొని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు.