byసూర్య | Thu, Jun 08, 2023, 03:34 PM
కూకట్ పల్లి నియోజకవర్గం బాలాజీ నగర్ డివిజన్ లో 4 కోట్ల 34 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు గురువారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శంకుస్థాపనలు చేశారు. ఈ అభివృద్ధి పనులలో సి. సి. రోడ్లు లేయింగ్ వివేక్ నగర్ కమ్యూనిటీ హాల్ దగ్గర - 50 లక్షలు, సి. సి. రోడ్లు లేయింగ్ - 2 & 3 పార్క్ వెనుక - 90 లక్షలు, స్వామి వివేకానంద పార్క్ ప్రారంభోత్సవం - రోడ్. నెం. 3 హనుమాన్ టెంపుల్ వెనుక 35 లక్షలు, బతుకమ్మ కుంట పార్క్ కాంపౌండ్ వాలు అభివృద్ధి కొరకు - 50 లక్షలు, సి. సి. రోడ్లు లేయింగ్ - ఆంజనేయ నగర్ సీతారామ కళ్యాణ మండపం దగ్గర - 50 లక్షలు, సి. సి. రోడ్లు లేయింగ్ - శక్తి నగర్ దగ్గర 120 లక్షల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.