byసూర్య | Thu, Jun 08, 2023, 02:10 PM
యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల భాగంగా రాయగిరి చెరువు కట్ట దగ్గర అమ్మవారిని జిల్లా కలెక్టర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేల సత్పతి బోనాన్ని ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి గుండు ముత్తయ్య గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.