byసూర్య | Thu, Jun 08, 2023, 02:08 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ పరిధి శంబిపూర్ లోని ఎమ్మెల్సీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని గురువారం శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. అదే విధంగా శుభ కార్యాలకు హాజరు కావాలని పలువురు ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.