ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

byసూర్య | Thu, Jun 08, 2023, 02:03 PM

ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయిన గడ్డివాము ప్రాంతాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ పరిశీలించారు. మస్కాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త ఏ. శ్రీనివాస్ కు చెందిన గడ్డివాము నిన్న షార్ట్ సర్క్యూట్తో కాలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ గురువారం గడ్డివాము కాలిపోయిన ప్రాంతాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీనివాస్ కు ప్రభుత్వ పరంగా సహాయం చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, తాసిల్దార్ రాజ్మోహన్, పలువురు ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ సిద్ధం Fri, Apr 19, 2024, 08:58 PM
చిలుకూరు బాలాజీ గరుడ ప్రసాద వితరణకు పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాట Fri, Apr 19, 2024, 07:49 PM
చిలుకూరు గరుడ ప్రసాదం కోసం బారులు తీరిన భక్తులు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ Fri, Apr 19, 2024, 07:46 PM
తెలంగాణలో సమ్మర్ హీట్.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ Fri, Apr 19, 2024, 07:42 PM
తెలంగాణలో ఎంపీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఆ అవకాశం కూడా కల్పించిన ఈసీ Fri, Apr 19, 2024, 07:37 PM