దేవాలయ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

byసూర్య | Thu, Jun 08, 2023, 01:30 PM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని రిడ్జ్ టవర్స్ లో నూతనంగా చేపడుతున్న శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ పనులకు గురువారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ కార్పొరేటర్లు కేఎం గౌరీష్ , బొడ్డు వెంకటేశ్వర రావు తో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ పనులకు భూమిపూజ చేయడం పట్ల సంతోషంగా ఉందని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధిలో ఎల్లవేళలా ముందుంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు, స్థానిక సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM