byసూర్య | Thu, Jun 08, 2023, 01:14 PM
ఇటిక్యాల మండలం షాబాద్ గ్రామం నుండి చాగాపురం గ్రామం వరకు 2 కిలో మీటర్లు బిటి రోడ్ పనులను అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వియం అబ్రహం గురువారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలు సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. గ్రామాల్లో గుణాత్మక మార్పు కోసం సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.