byసూర్య | Thu, Jun 08, 2023, 01:11 PM
ప్రేమ కోసం ఓ ప్రేమికుడు మొబైల్ ను చోరీ చేసిన ఘటన జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలో చోటు చేసుకుంది. ప్రముఖ వెబ్ సైట్ కథనం ప్రకారం పొలాస గ్రామానికి చెందిన ఓ యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. ఆ యువతీ మొబైల్ ఫోన్ కొనివ్వాలని కోరగా ఆర్థిక స్థోమతలేని ఆ యువకుడు ఈ నెల 3న రాత్రి అదే గ్రామంలోని ఓ వ్యక్తి ఇంట్లో చొరబడి మొబైల్, పర్స్ చోరీ చేశాడు.
అనంతరం ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో దూరి ల్యాప్టాప్ అలాగే బెల్ట్షాపులోకి వెళ్లి సుమారు రూ.10 వేల నుంచి రూ.20 వేల విలువైన మద్యం అపహరించాడు. ఈ మేరకు బాధితులు రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలించి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు. అందులో ఒక యువకుడు చోరీ చేసిన సెల్ఫోన్ను తన ప్రియురాలికి అప్పగించినట్లు విచారణలో తెలుపగా సదరు యువతి నుంచి పోలీసులు బుధవారం సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.