byసూర్య | Thu, Jun 08, 2023, 01:04 PM
తెలంగాణ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి ఓ ప్రముఖ దినపత్రికలు వచ్చిన కథనం ప్రకారం ..హైదరాబాద్ లో విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిని ఏఐఎస్ఎఫ్ నాయకులు బుధవారం కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. నిజాంబాద్ లోని తెలంగాణ యూనివర్సిటీను ప్రక్షాళన చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం కోరారు. తెయూ వీసీ రవీందర్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో యూనివర్సిటీ భవిష్యత్తు ప్రమాదకరంగా మారిందని రఘురాం పేర్కొన్నారు. రిజిస్ట్రార్ నియామకంలో తన మాటే చెల్లుబాటు కావాలనే దుర్బుద్ధితో ఈసీ నిర్ణయాలను సైతం లెక్క చేయకుండా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠారెడ్డి, పుట్ట లక్ష్మణ్, పాల్గొన్నారు.