చెరువుల పండగ కార్యక్రమంలో పాల్గొననున్న ఎంపీ నామా

byసూర్య | Thu, Jun 08, 2023, 12:46 PM

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ కేంద్రంలో గురువారం సాయంత్రం 6 నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న చెరువుల పండుగ కార్యక్రమానికి ఖమ్మం పార్లమెంటు సభ్యులు, తెలంగాణ రాష్ట్ర లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు హాజరుకానున్నట్లు మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు.


అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఖమ్మం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, తెలంగాణ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్, మధిర మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు హాజరుకానున్నట్లు తెలిపారు.కావున నియోజకవర్గంలోని ముదిగొండ, ఎర్రుపాలెం, మధిర, చింతకాని, బోనకల్ మండలాల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు సకాలంలో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM