byసూర్య | Thu, Jun 08, 2023, 12:45 PM
విద్యుత్ వినియోగదారుల ధీర్ఘ కాలిక సమస్యలను పరిష్కరించేందుకు ఈ నెల 15 న సమావేశం నిర్వహిస్తున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. రాజేంద్రనగర్ డివిజన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీజీఆర్ఎస్ చైర్పర్సన్, మెంబర్ టెక్నికల్, మెంబర్ ఫైనాన్స్, వినియోగదారులు హాజరుకానున్నారన్నారు. ఈ నెల 15 న మధ్యాహ్నం ఒంటిగంటకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. వినియోగదారులు పాల్గొని దీర్ఘకాలికంగా ఉన్న విద్యుత్ సమస్యలు, బిల్లుల్లో హెచ్చుతగ్గులు తదితర సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.