byసూర్య | Thu, Jun 08, 2023, 12:15 PM
కూసుమంచి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సీతారామచంద్రా స్వామి దేవాలయ శంకుస్థాపన పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గురువారం హాజరయ్యారు. గ్రామ ప్రజల, ఆలయ నిర్మాణ కమిటీ కోరిక మేరకు గర్భగుడి నిర్మాణానికి 40 లక్షల రూపాయల విరాళం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.