byసూర్య | Thu, Jun 08, 2023, 12:12 PM
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం అజ్జమర్రి గ్రామ శివారులో మంజీరా నదిపై 8 కోట్ల 68 లక్షల వ్యయంతో నిర్మించిన చెక్ డ్యామ్ ను నర్సాపూర్ శాసనసభ్యులు చిలుముల మధన్ రెడ్డితో కలిసి బుధవారం రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునితాలక్ష్మారెడ్డి ప్రారంభించారు. అనంతరం గంగా మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.