byసూర్య | Thu, Jun 08, 2023, 11:52 AM
మహేశ్వరం మండల కేంద్రంలో రూ: 90 లక్షల రూపాయలతో అతి పురాతనమైన మెట్ల బావి(కోనేరు ) పునరుద్ధరీకరణ పనులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ...ప్రాచీన, వారసత్వ కట్టడాలను కాపాడుతూ వాటిని భవిష్యత్తు తరాలకు అందించాలని పునరుద్దరికన, సుందరికరణ చేపడుతున్నట్లు తెలిపారు. మహేశ్వరం లోని అతి ప్రాచీన మెట్ల బావిని పునరుద్దరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.