byసూర్య | Thu, Jun 08, 2023, 11:46 AM
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం బొమ్మన్ కుంట గ్రామంలో ఎంఎంఆర్ యువసేన ఆత్మీయ సమ్మేళనాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ సమక్షంలో గ్రామపంచాయతీ నాలుగో వార్డు సభ్యుడు రాజు వారి అనుచరులతో ఎన్ఎంఆర్ యువసేనలో చేరారు. యువసేనలోకి సర్పంచ్ నీలం మధు ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నీలం మధు మాట్లాడుతూ ప్రజా సేవే పరమావధిగా ఏర్పాటైన ఎన్ఎంఆర్ యువసేన నేడు అందరి మన్ననలు పొందుతూ ముందుకు వెళ్లడం పై సంతోషం వ్యక్తం చేశారు. యువసేన సేవా కార్యక్రమాలకు ఆకర్షితులైన ప్రతి ఒక్కరు యువసేనలో చేరుతుండడం గర్వకారణం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందించే విధంగా యువసేన సభ్యులు కృషి చేయాలన్నారు. మంత్రులు కేటీఆర్ హరీష్ రావు నేతృత్వంలో యువసేన సభ్యులు గ్రామ గ్రామాన సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు అహ్మద్ అజయ్ మల్లేష్ మురళి ఆనంద్ గిరి తిమ్మప్ప ఆదిరెడ్డి నారాయణ రాము శంకరయ్య దేవి ప్రసాద్ వెంకటయ్య గంగయ్య స్వామి నరసింహ రాములు యాదగిరి బాలరాజ్ ఎన్ ఎమ్ ఆర్ యువసేన సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.