byసూర్య | Thu, Jun 08, 2023, 11:43 AM
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఓ అల్లుడు అత్తమామలపై దారుణంగా కత్తితో దాడి చేశాడు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్నపూర్ణ కాలనీ లో నివాసముంటున్న సూరయ్య, రుక్మిణి అనే వృద్ద దంపతులను వారి నివాసంలోనే అల్లుడు అనిల్ కుమార్ కత్తితో అత్త గొంతు కోయగా, మామ తల పగలగొట్టి పరారయ్యాడు. వారి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు 108కు సమాచారం అందించి దంపతులను గాంధీ ఆసుపత్రికి తరలించారు.