byసూర్య | Thu, Jun 08, 2023, 10:30 AM
తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు దరఖాస్తు సమయంలో చేసిన తప్పులు సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించారు. తప్పులను నేడు రాత్రి 8 లోపు సరిచేసుకోవాలని, ఇదే చివరి అవకాశమని TSLPRB తెలిపింది. కాగా, రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్స్ ను ఈ నెల 14 నుండి 26 వరకు పరిశీలించాలని నిర్ణయించింది. దీనికోసం 18 కేంద్రాలను ఏర్పాటు చేసింది.