byసూర్య | Wed, Jun 07, 2023, 08:32 PM
మహేశ్వరం మండల కేంద్రంలో 90 లక్షల రూపాయల వ్యయంతో అతి పురాతనమైన మెట్ల బావి(కోనేరు ) పునరుద్ధరీకరణ పనులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రాచీన,వారసత్వ కట్టడాలను కాపాడుతూ వాటిని భవిష్యత్తు తరాలకు అందించాలని పునరుద్దరికన,సుందరికరణ చేపడుతున్నట్లు తెలిపారు.మహేశ్వరం లోని అతి ప్రాచీన మెట్ల బావిని పునరుద్దరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయనంద్ఎం, పీపీ రఘుమా రెడ్డి, జడ్పీటీసీ జంగారెడ్డి, వైస్ ఎంపీపీ సునీత అంధ్యానాయక్, మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.