byసూర్య | Wed, Jun 07, 2023, 01:14 PM
ఈ నెల 10న నిర్వహిస్తున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కోడంగల్ ఎస్సై రవి గౌడ్ సూచించారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఫిర్యాదుదారుడు, నేరస్తుడు ఆధార్ కార్డులను తీసుకొని ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు పోలీస్ స్టేషన్ కు వస్తే అవగాహన కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని మండల పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.