రైల్వేశాఖలోని ఆ ఖాళీలను వెంటనే భర్తీచేయండి: వినోెద్ కుమార్

byసూర్య | Mon, Jun 05, 2023, 09:16 PM

రైలు ప్రమాదాలకు సిబ్బంది కొరత కూడా ఓ కారణమన్న విమర్శలువస్తున్నాయి. రైల్వే శాఖలో మూడు లక్షలకు పైగా ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఆయన సోమవారం ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు లేఖ రాశారు. రైల్వేలో 3.12 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. 


ఇందులో దక్షిణ మధ్య రైల్వేలోనే 30 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం వల్ల ఉన్న సిబ్బందిపై పని ఒత్తిడి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పర్యవేక్షణ లోపానికి దారి తీసి, ప్రమాదాలకు కారణంగా మారుతోందన్నారు. కాబట్టి ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు.



Latest News
 

రెజిమెంటల్ బజార్ లో శ్రీగణేశ్ పాదయాత్ర Fri, Apr 19, 2024, 01:40 PM
దుర్గా దేవస్థానం అష్టమ కళ్యాణ వార్షికోత్సవం ఆహ్వానం Fri, Apr 19, 2024, 01:40 PM
ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ ను భారీ మెజారిటీతో గెలిపిద్దాం Fri, Apr 19, 2024, 01:38 PM
ప్లాస్టిక్ విక్రయ దుకాణాల్లో తనిఖీలు Fri, Apr 19, 2024, 01:38 PM
మోడీ ప్రోత్సాహంతో తెలంగాణలో వెలుగులు: ఎంపీ అభ్యర్థి శానంపూడి Fri, Apr 19, 2024, 01:27 PM