గద్వాల్ జిల్లాలో తీవ్ర విషాదం.... కృష్ణా నదిలో నలుగురు చిన్నారులు మృతి

byసూర్య | Mon, Jun 05, 2023, 07:47 PM

సరదాగా కృష్ణా నదిని చూసేందుకు వెళ్లిన ఓ కుటుంబానికి తీరని విషాదం మిగిలింది. జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఈ తీవ్ర విషాదం నెలకొంది.  నదిని చూసేందుకు వెళ్లిన నలుగురు చిన్నారులు అదే నదిలో మునిగి మృత్యువాత పడ్డారు. సెలవులు కావటంతో.. ఆలంపూర్ నియోజవకర్గానికి చెందిన ఓ కుటుంబం సరదాగా కృష్ణా నదిని చూసేందుకు వెళ్లాలనుకున్నారు. అందుకోసం మొత్తం 11 మంది ఓ ఆటోలో వెళ్లారు. ఇటిక్యాల మండలం మంగంపేట వద్ద ఉన్న కృష్ణా నది వద్ద ఆగి.. నది అందాలను ఆస్వాధించారు. గలగలా పారుతున్న కృష్ణా నదిని చూసి చిన్నారులు గంతులేశారు. నీటితో ఆడుకునేందుకు అందులోకి వెళ్లారు. అయితే.. ఆ చిన్నారు వెళ్లిన చోట లోతు ఎక్కువగా ఉండడంతో నలుగురూ నీళ్లలో మునిగిపోయారు.


ప్రమాదవశాత్తు నలుగురిలో ఎవ్వరికి ఈత రాకపోవటంతో అందరూ నదిలో మునిగిపోయి.. ప్రాణాలు విడిచారు. మృతి చెందినవారు అఫ్రీన్ (17), సమీర్ (8), రిహాన్ (15), నౌసీన్ (7) అని గుర్తించారు. ఈ ఘటనతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావటంతో.. రోధనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు నది వద్దకు చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM
అమ్మవారిని దర్శించుకున్న మంత్రి Thu, Apr 25, 2024, 01:06 PM
ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించండి Thu, Apr 25, 2024, 01:04 PM
అలంపూర్ ఆలయాలలో ప్రత్యేక పూజలు Thu, Apr 25, 2024, 12:59 PM