హైదరాబాద్‌ బాలానగర్‌లో ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులో అగ్నిప్రమాదం

byసూర్య | Fri, Jun 02, 2023, 08:44 PM

హైదరాబాద్‌లోని బాలానగర్‌లోని ఓ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ బస్సు సుచిత్ర నుంచి కూకట్ పల్లి వైపు వెళ్తోంది. ఐడీపీఎల్ సమీపంలోకి రాగానే ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును ఆపి కిందకు దిగాడు. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు.


Latest News
 

గుర్తు తెలియని మగ వ్యక్తి శవం లభ్యం Fri, Apr 19, 2024, 03:39 PM
ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపును పరిశీలించిన కలెక్టర్ Fri, Apr 19, 2024, 03:38 PM
వ్యాపార కాంక్షతోనే బీబీ పాటిల్ పోటీ Fri, Apr 19, 2024, 03:37 PM
ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెన్షన్: డీఈవో రాజు Fri, Apr 19, 2024, 03:35 PM
జాతీయ రహదారిలో ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్ Fri, Apr 19, 2024, 03:33 PM