తెలంగాణ భవన్‌ ప్రాంగణంలో తెలంగాణ యువతి ఆత్మహత్యాయత్నం

byసూర్య | Fri, Jun 02, 2023, 08:11 PM

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ లో  కలకలం చోటు చేసుకొంది. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు చేస్తున్న తెలంగాణ యువతి, ఆరిజిన్‌ డెయిరీ సీఈవో బోడపాటి శేజల్‌.. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ ప్రాంగణంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శుక్రవారం (జూన్ 2) సాయంత్రం ఢిల్లీలోని తెలంగాణ భవన్ ప్రాంగణానికి వచ్చిన శేజల్.. అక్కడ పురుగుల మందు తాగింది. ఆమెను గమనించిన తెలంగాణ భవన్‌ సిబ్బంది వెంటనే ఆమెను ఆర్‌ఎంఎల్‌ ఆసుపత్రికి తరలించారు.


మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై శేజల్ కొంతకాలంగా సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె ఆరోపిస్తోంది. రెండు రోజుల కిందట ఢిల్లీలోని మహిళా కమిషన్‌, హెచ్‌ఆర్సీని కలిసి ఫిర్యాదు చేసింది. ఢిల్లీ వరకూ వచ్చి ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏంటని ఢిల్లీ కమిషన్ తనను ప్రశ్నించిందని.. తాను చెప్పిన సమాధానంతో వారు సంతృప్తి చెందారని శేజల్ తెలిపింది. ఇంతలోనే ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది.


ఎమ్మెల్యే వర్గీయులు తనను చంపుతామని బెదిరిస్తున్నారని శేజల్ తన ఫిర్యాదులో పేర్కొంది. తనపై తప్పుడు కేసులు పెట్టించి బెదిరింపులకు గురిచేస్తున్నారని తెలిపింది. దీనిపై తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొంది.



Latest News
 

150 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరికలు Sat, Apr 20, 2024, 10:49 AM
ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి Sat, Apr 20, 2024, 10:34 AM
కాంగ్రెస్ పార్టీలో చేరికలు Sat, Apr 20, 2024, 10:32 AM
గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM