తెలంగాణలో ఆషాడ బోనాలు,,,ప్రభుత్వం తరపున నిధులు మంజూరు

byసూర్య | Fri, Jun 02, 2023, 08:09 PM

ప్రతి ఏటా ఆషాడమాసంలో తెలంగాణలో బోనాల పండుగ నిర్వహిస్తారు. పల్లె నుంచి పట్నం వరకు ఆషాడమాసంలోని ప్రతి ఆదివారం, గురువారాల్లో గ్రామదేవతలకు బోనం(భోజనం) సమర్పిస్తారు. ప్రతి సంవత్సరాలాగే ఈ ఏడాది కూడా ఆషాద బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 22న గోల్కొండలో బోనాలు ప్రారంభం కానుండగా.. జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, జులై 16న ఓల్డ్ సిటీ బోనాలు జరగుతాయని తెలంగాణ పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికే ప్రకటించారు.


హైదరాబాద్‌లో త్వరలో జరిగే బోనాల ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలాగే నిధులు ప్రకటించింది. ఈ ఏడాది కూడా ఆషాడ ఉత్సవాలకు సీఎం కేసీఆర్ రూ.15 కోట్లు కేటాయించినట్లు మంత్రి తలసాని వెల్లడించారు. బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం అందించే ఆర్థిక‌ సహాయం కోసం వారం రోజుల్లోగా ఆలయ కమిటీలు ప్రభుత్వానికి దరఖాస్తులు చేయాలని మంత్రి సూచించారు. బోనాల ఉత్సవాల కోసం దేవాదాయ శాఖ ప‌రిధిలో లేని దేవాలయాలకు ప్రభుత్వం ఆర్థిక సాయ అందిస్తుందని పేర్కొన్నారు. బోనాల పండుగ‌కు ముందే ఆర్థిక స‌హాయం అందించాల‌ని రాష్ట్ర ప్రభత్వం నిర్ణయించింద‌ని మంత్రి స్పష్టం చేశారు.


గోల్కొండ, సికింద్రాబాద్, లాల్ దర్వాజ బోనాల ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలకుండా చర్యలు చేపడతామని చెప్పారు. బోనాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నమని.. అలాంటి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా వైభవంగా నిర్వహిస్తుందని మంత్రి చెప్పారు.



Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM