ఎల్బీనగర్‌లో ఘోర ప్రమాదం,,,కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా చిన్నారి మృతి

byసూర్య | Fri, Jun 02, 2023, 07:18 PM

హయత్ నగర్ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో పాప మృతి చెందిన ఘటన మరువక ముందే హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో మరో ఘోరం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన కారు ఆపిన డ్రైవర్ సడెన్‌గా డోర్ తీయటంతో బైక్ వెళ్తున్న రెండేళ్ల పాప మృత్యువాత పడింది. ఘటన వివరాల్లోకి వెళితే.. శశిరేఖ, సయ్యద్ దంపతులకు ధనలక్ష్మి అనే రెండేళ్ల చిన్నారి ఉంది. సయ్యద్ దంపతులు తమ పాపన బైక్‌పై బయల్దేరారు. ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి సమీపంలోకి రాగానే.. ఓ వ్యక్తి రోడ్డు పక్కన కారు ఆపాడు. ఆపై వెనుక నుంచి ఎవరొస్తు్న్నారో చూసుకోకుండా సడెన్‌గా డోర్ తీశాడు. అంతే.. వెనుక నుంచి బైక్ వస్తున్న సయ్యద్ బైక్‌కు కారు డోరు తగిలింది. ఈ ఘటనలో చిన్నారి సహా దంపతులు కిందపడిపోగా.. ధనలక్ష్మి స్పాట్‌లోనే చనిపోయింది. సయ్యద్, శశిరేఖ దంపతులకు గాయాలయ్యాయి.


అలా కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా డోర్ తీయటంతో పసితనంలో చిన్నారికి నిండు నూరేళ్లు నిండిపోయాయి. చిన్నారి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గుండెలవిసేలా రోధించిన తీరు అక్కడున్న వారిచే కంటతడి పెట్టించింది. ఘటన తర్వాత కారు డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించగా.. స్థానికులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సయ్యద్ దంపతులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి.



Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM